YSRCP: మా కుటుంబంలో ఆత్మీయుడిని కోల్పోయాం: జగన్ సతీమణి భారతి

  • సోమయాజులు భౌతికకాయానికి భారతి నివాళులు
  • ఆయన ఆత్మకు శాంతి కలగాలి
  • నేటి తెల్లవారుజామున మరణించిన సోమయాజులు

వైఎస్సార్‌ కాం‍గ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు మరణంతో తమ కుటుంబంలో ఓ ఆత్మీయుడిని కోల్పోయినంత బాధ కలుగుతోందని వైకాపా అధినేత వైఎస్ జగన్ సతీమణి, సాక్షి మీడియా గ్రూప్ చైర్ పర్సన్ వైఎస్ భారతి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం సోమయాజులు నివాసానికి వచ్చి ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించిన ఆమె, ఆపై మాట్లాడుతూ, సోమయాజులు మరణం తీరని లోటని అన్నారు.

ఆయన మృతి వార్త తెలుసుకుని తాను దిగ్భ్రాంతికి గురయ్యానని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నామని వెల్లడించారు. కాగా, ఈ తెల్లవారుజామున సోమయాజులు అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. వైఎస్‌ హయాంలో ఆర్థిక సలహాదారుగా కూడా పనిచేసిన సోమయాజులు, గతంలో అగ్రికల్చర్‌ టెక్నాలజీ విభాగానికి డిప్యూటీ ఛైర్మన్‌ గా సేవలందించడంతో పాటు ఆరోగ్యశ్రీ పథకానికి రూపకల్పన చేయడంలో కీలక పాత్ర పోషించారు.

  • Loading...

More Telugu News