Karnataka: ఓ నెటిజన్ చమత్కారపు ట్వీట్ కు కేటీఆర్ స్పందన ఇది!

  • ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జరిగే మ్యాచ్ లో బెంగళూరు భవితవ్యం తేలిపోతుందన్న నెటిజన్
  • రెండు టీమ్స్ పవర్ ప్లేకు సిద్ధపడుతున్నాయంటూ ట్వీట్
  • కర్ణాటక అసెంబ్లీలో బలనిరూపణ గురించేగా: కేటీఆర్ స్పందన

‘ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు జరిగే ముఖ్యమైన మ్యాచ్ లో బెంగళూరు భవిష్యత్ తేలిపోతుంది. ఈ గేమ్ లో తప్పక విజయం సాధించాలనే ఉద్దేశంతో రెండు టీమ్స్ తమ బలాబలాలను నిరూపించుకునేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నాయి...’ అంటూ ఓ నెటిజన్ చేసిన ఆసక్తికర ట్వీట్ కు మంత్రి కేటీఆర్ కరెక్టుగా స్పందించారు.

‘అదే సమయంలో కర్ణాటక అసెంబ్లీలో బలనిరూపణ ప్రక్రియ ప్రారంభమవుతుందనే విషయాన్ని మీరు చెప్పదలచుకున్నారని నేను భావిస్తున్నా’ అని కేటీఆర్ చిరు నవ్వులు చిందించే ఎమోజీని పోస్ట్ చేశారు. కాగా, కర్ణాటక అసెంబ్లీలో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు బీజేపీ తన బలాన్ని నిరూపించుకోనున్న విషయం తెలిసిందే. బీజేపీ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలంటే తమకు మద్దతు పలికే ఎమ్మెల్యేల సంఖ్యను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో, కాంగ్రెస్-జేడీఎస్ లకు మద్దతుగా నిలిచే ఎమ్మెల్యేల సంఖ్య తేటతెల్లం కానుంది.

ఇదిలా ఉండగా, ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా జైపూర్ వేదికగా ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) మ్యాచ్ జరగనుంది. ఈ రెండు టీమ్ లు 12 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. ఈరోజు జరిగే మ్యాచ్ లో తమ సత్తా చాటుకోవాల్సిన అవసరం రెండు టీమ్ లకు ఉంది. దీంతో, రెండు టీమ్ లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది.

  • Loading...

More Telugu News