Karnataka: కర్ణాటక అసెంబ్లీ సమావేశం ప్రారంభం

  • వందేమాతరం గేయంతో కర్ణాటక అసెంబ్లీ సమావేశం ప్రారంభం
  • కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రొటెం స్పీకర్ 
  • నేడు అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోనున్న బీజేపీ

కర్ణాటక అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ బోపయ్య సభ్యులతో ప్రమాణం చేయించారు. అంతకుముందు, ప్రొటెం స్పీకర్ బోపయ్య అసెంబ్లీలోకి ప్రవేశించిన అనంతరం, సీఎం యడ్యూరప్ప, మాజీ సీఎం సిద్ధరామయ్య సహా ఎమ్మెల్యేలందరూ లోపలికి ప్రవేశించారు. సరిగ్గా ఉదయం పదకొండు గంటలకు వందేమాతరం గేయంతో కర్ణాటక అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది.

కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన బీజేపీ నేత యడ్యూరప్ప నేడు శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. దీంతో ఎలాంటి ఫలితం రానుందో అనే దానిపై ఆసక్తి నెలకొంది.  

  • Loading...

More Telugu News