gold: 430 రూపాయలు తగ్గిన బంగారం ధర

  • తగ్గిన డిమాండ్
  • పది గ్రాముల పసిడి ధర రూ.32,020గా నమోదు
  • కేజీ వెండి ధర 250 తగ్గి రూ.40,650కి చేరిక

బులియన్‌ మార్కెట్‌లో ఈ రోజు బంగారం ధర భారీగా తగ్గింది. పది గ్రాముల పసిడి ధర 430 రూపాయలు తగ్గి రూ.32,020గా నమోదైంది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక బంగారం వ్యాపారుల నుంచి డిమాండ్‌ తగ్గడంతో ధరలు ఒక్కసారిగా పడిపోయాయని విశ్లేషకులు చెబుతున్నారు.

కాగా, వెండి ధరలు కూడా ఈ రోజు తగ్గాయి. కేజీ వెండి ధర 250 తగ్గి రూ.40,650కు చేరింది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో వెండి ధరలు తగ్గాయి.

gold
silver
rates
  • Loading...

More Telugu News