mohan babu: 'మహానటి' దర్శక నిర్మాతలకు మంచు ఫ్యామిలీ సత్కారం

  • 'మహానటి'కి అపూర్వ విజయం
  • అన్ని ప్రాంతాల్లోను భారీ వసూళ్లు
  • దర్శక నిర్మాతలపై ప్రశంసల జల్లు

విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి 'మహానటి' సినిమాకి విశేషమైన ఆదరణ లభిస్తోంది. వసూళ్ల విషయంలో ఈ సినిమా కొత్త రికార్డులను నమోదు చేసే పనిలో వుంది. ఇటు సాధారణ ప్రేక్షకుల నుంచి .. అటు ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి ఈ సినిమా టీమ్ కి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంతటి చక్కని ప్రయత్నం చేసిన ఈ సినిమా టీమ్ ను చిరంజీవి .. అల్లు అరవింద్ సత్కరించారు. తాజాగా ఈ సినిమా దర్శక నిర్మాతలను మంచు ఫ్యామిలీ తమ ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యమిచ్చారు. మోహన్ బాబు .. విష్ణు .. లక్ష్మి కలిసి దర్శక నిర్మాతలను అభినందిస్తూ సత్కరించారు. ఈ సినిమాలో ఎస్వీ రంగారావుగా మోహన్ బాబు కనిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో .. అది సాధించిన విజయంలో తనని కూడా భాగం చేసినందుకు మోహన్ బాబు ఆనందాన్ని వ్యక్తం చేశారు.   

  • Loading...

More Telugu News