Karnataka: ఎన్నికైన ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్న ‘కాంగ్రెస్’ దూతలు!

  • తమ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ మంతనాలు  
  • ప్రైవేట్ హోటల్లో దేవెగౌడ, కీలక జేడీ ఎస్ నేతల మకాం
  • కాంగ్రెస్ పార్టీలో ఉన్న లింగాయత్ లతో యడ్యూరప్ప రహస్య భేటీ

కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎవరికి వారే తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికైన ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ దూతలు భేటీ అవుతున్నారు. కాంగ్రెస్ నేతలు గులాంనబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్, వేణుగోపాల్, మధుయాష్కీ ఇప్పటికే బెంగళూరులో ఉన్నారు.

ప్రైవేట్ హోటల్లో దేవెగౌడ, కీలక జేడీ ఎస్ నేతలు మకాం వేసి మంతనాలు సాగిస్తున్నారు. ఇక బీజేపీ గురించి చెప్పాలంటే.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న లింగాయత్ లతో యడ్యూరప్ప రహస్య భేటీ జరిపినట్టు సమాచారం. మరోపక్క, బీజేపీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. అనంతరం, రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి ఓ లేఖ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రులు నడ్డా, ప్రకాష్ జవదేకర్ ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకున్నారు.

  • Loading...

More Telugu News