Karnataka: కర్ణాటక ఎన్నికల ఫలితాలపై స్పందించిన మోదీ

  • బీజేపీ కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా అవతరించింది
  • కర్ణాటక సోదర, సోదరీమణులకు కృతజ్ఞతలు 
  • బీజేపీ కార్యకర్తలకు సెల్యూట్‌

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఫలితాల్లో 104 సీట్లు సాధించి ఆ రాష్ట్రంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. భారతీయ జనతా పార్టీ విధానమైన అభివృద్ధి అజెండాకు మద్దతు తెలుపుతూ తమ పార్టీని కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా అవతరింపజేసిన ఆ రాష్ట్ర సోదర, సోదరీమణులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. అలాగే పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తూ బీజేపీని గెలిపించిన కార్యకర్తలకు సెల్యూట్‌ చేస్తున్నానని అన్నారు. కాగా, కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఓ వైపు జేడీఎస్‌-కాంగ్రెస్‌ ప్రయత్నిస్తుండగా, మరోవైపు బీజేపీ కూడా తమ ప్రయత్నాలు మొదలుపెట్టింది.

  • Loading...

More Telugu News