Chandrababu: చంద్రబాబు తన వైఫల్యాలను ఇతర పార్టీలపై వేస్తున్నారు!: వైసీపీ నేత విజయసాయిరెడ్డి

  • చంద్రబాబు తన స్వలాభం కోసం ‘ప్యాకేజ్’ కు ఒప్పుకున్నారు
  • ఉత్తర కుమారుడిలా ప్రగల్భాలు పలుకుతున్నారు
  • బీజేపీతో వైసీపీ జతకట్టిందనే దుష్ప్రచారం తగదు
  • ప్రత్యేకహోదా ఎవరిస్తే వారితో కలిసి పనిచేస్తాం

ఎన్నికల హామీలను నెరవేర్చని చంద్రబాబు తన వైఫల్యాలను ఇతర పార్టీల మీద వేస్తున్నాడని వైసీపీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. విశాఖపట్టణంలోని దక్షిణ నియోజకవర్గంలో సంఘీభావ యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో పాల్గొన్న విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా తాకట్టుపెట్టిన చంద్రబాబు తన స్వలాభం కోసం ప్యాకేజ్ కు ఒప్పుకున్నారని ఆరోపించారు.

ఇటువంటి వ్యక్తి, ఉత్తర కుమారుడిలా ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. బీజేపీతో వైసీపీ జతకట్టిందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆ పార్టీతో వైసీపీ జతకట్టని విషయాన్ని బీజేపీ అధికార ప్రతినిధే స్వయంగా స్పష్టం చేసిన విషయాన్ని విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. ఏపీ ప్రయోజనాలే తమకు ముఖ్యమని, ప్రత్యేకహోదా ఎవరు ఇస్తారో వారితో తాము కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News