Pawan Kalyan: సొంత జిల్లా ప్రజలకు చంద్రబాబు ఎందుకు న్యాయం చేయట్లేదు?: పవన్‌ కల్యాణ్‌

  • భూనిర్వాసితులకు న్యాయం చేయాల్సిందే 
  • ఓ వైపు విదేశాల నుంచి వచ్చే వారికి వేల ఎకరాలు ఇస్తున్నారు
  • నంద్యాలలో ఇచ్చిన నష్ట పరిహారం ఇక్కడ ఎందుకు ఇవ్వరు?

శ్రీకాళహస్తిలో పర్యటిస్తోన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అక్కడి ఆలయాలను దర్శించుకున్న తరువాత చిత్తూరులోని హై రోడ్ వెల్పేర్‌ ఆప్షన్‌ బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఆయన విమర్శలు గుప్పించారు. చంద్రబాబు తన సొంత జిల్లాలోని ప్రజలకు న్యాయం చేయలేదని, ఇక మిగిలిన జిల్లాల ప్రజలకు ఏం న్యాయం చేస్తారని నిలదీశారు. భూనిర్వాసితులకు న్యాయం చేయాల్సిందేనని ఉద్ఘాటించారు.

ఓ వైపు విదేశాల నుంచి వచ్చే వారికి వేల ఎకరాలు ఇస్తూ సొంత జిల్లా వాసులకు న్యాయం ఎందుకు చేయరని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. అలాగే, విజయనగరం, శ్రీకాళహస్తి, నంద్యాలలో ఇచ్చిన నష్ట పరిహారం చిత్తూరులో ఎందుకు ఇవ్వడం లేదని ఆయన నిలదీశారు.

  • Loading...

More Telugu News