Karnataka: పది మంది మంత్రులు ఓడిపోయారు.. కాంగ్రెస్ సత్తా ఇదీ!: బీజేపీ ఎద్దేవా

  • కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత ఉందడానికి ఈ సంఘటనే నిదర్శనం
  • కాంగ్రెస్ కుయుక్తులకు ఓటర్లు తగినబుద్ధి చెప్పారు
  • బీజేపీకి పట్టులేదన్న నియోజకవర్గాల్లో మా సత్తా చాటాం 

ఇప్పటివరకు వెలువడిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పది మంది సిట్టింగ్ మంత్రులు ఓటమి పాలయ్యారని బీజేపీ ఎద్దేవా చేసింది. కర్ణాటక బీజేపీ ఈ మేరకు వరుస ట్వీట్లు చేసింది. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎంతటి వ్యతిరేకత ఉందో చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనమని పేర్కొంది. ప్రజలను విభజించి ఓట్లు దండుకునే కుయుక్తులకు కాంగ్రెస్ పాల్పడటం, ప్రభుత్వ పని తీరు అసమర్థంగా ఉండటంతో ఓటర్లు ఆ పార్టీని తిరస్కరించారని విమర్శించారు.

కర్ణాటకలో ఏ నియోజకవర్గాల్లో అయితే బీజేపీకి పట్టులేదని ఒపినీయన్ పోల్స్ లో పేర్కొన్నారో, ఆయా నియోజకవర్గాల్లో తమ సత్తా చాటామని తెలిపింది. మనల్ని గెలిపించాలని ప్రజలు నిర్ణయం తీసుకుంటే, ఏ శక్తీ ఆ విజయాన్ని ఆపలేదని తెలిపింది. కర్ణాటక వ్యాప్తంగా ఒకే తీరుగా బీజేపీ సీట్లు సాధించిందని, ఈసారి, కొత్త యువ నేతలు విధానసౌధలో అడుగుపెట్టనున్నారని పేర్కొంది.

  • Loading...

More Telugu News