Karnataka: ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సమావేశం కానున్న బీజేపీ

  • మ్యాజిక్ ఫిగర్‌కు 7 సీట్ల దూరంలో బీజేపీ
  • స్వతంత్ర అభ్యర్థులకు 2 సీట్లు
  • ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ మంతనాలు?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అత్యధిక సీట్లు సాధించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 112 సీట్లకు మరో 7 సీట్లను సాధించలేకపోతోంది. హంగ్‌ ఏర్పాటు దిశగా ఫలితాలు వస్తుండడంతో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ఈ రోజు సాయంత్రం 6 గంటలకు సమావేశం కానున్నారు. కాగా, కర్ణాటకలో ఇప్పటివరకు ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.

బీజేపీ వారితో పాటు జేడీఎస్‌తోనూ మంతనాలు జరుపుతోందని తెలుస్తోంది. కర్ణాటకలో ఓట్ల లెక్కింపు కేంద్రాల వ‌ద్ద‌ బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబ‌రాలు జ‌రుపుకుంటున్నారు. బీజేపీ అత్యధిక సీట్లు సాధించినందుకు గానూ అన్ని రాష్ట్రాల్లోని ఆ పార్టీ నేతలు సంబరాల్లో మునిగిపోతున్నారు.

  • Loading...

More Telugu News