Karnataka: హంగ్‌ దిశగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు.. ప్రభుత్వ ఏర్పాటుకు కీలకంగా మారిన జేడీఎస్‌

  • అతి పెద్ద పార్టీగా బీజేపీ
  • సాధారణ మెజార్టీకి కొన్ని సీట్ల దూరంలో బీజేపీ
  • రెండో స్థానంలో కాంగ్రెస్‌

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాలను పరిశీలిస్తే బీజేపీ మొత్తం 105 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ 75 స్థానాలకే పరిమితం కానుంది. జేడీఎస్‌కి 40 సీట్లు దక్కనున్నాయి. అయితే, మ్యాజిక్‌ ఫిగర్‌ 112ను ఏ పార్టీ అందుకునే అవకాశాలు లేవని స్పష్టంగా తెలిసిపోతోంది. దీంతో హంగ్‌ దిశగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఉన్నాయని తేలిపోయింది. ఈ సమయంలో జేడీఎస్ కీలకంగా మారింది. కర్ణాటకలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించగా, కాంగ్రెస్‌ రెండో స్థానానికే పరిమితం అయింది.                     

  • Loading...

More Telugu News