Jagan: సీఎం కుర్చీ కోసం జగన్ ఏ పని చేయడానికైనా సిద్ధపడ్డారు: అయ్యన్న పాత్రుడు

  • జగన్‌, విజయసాయిరెడ్డి పాదయాత్రలకు స్పందన లేదు
  • ఈ నెల 22న సీఎం ధర్మ పోరాట దీక్ష 
  • దీక్షలో లక్షమంది పాల్గొనేలా ఏర్పాట్లు

సీఎం కుర్చీ కోసం వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఏ పని చేయడానికైనా సిద్ధపడ్డారని, బీజేపీతో లాలూచీ పడ్డారని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. ఈ రోజు విశాఖపట్నంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడుతూ... ఏ1 నిందితుడు జగన్, ఏ2 విజయ సాయిరెడ్డి పాదయాత్రలకు జనాలు స్పందిస్తున్నారని అనుకోవడం వైసీపీ నేతల పొరపాటేనని, ఆ పాదయాత్రలు విఫలమవుతున్నాయని చెప్పారు. ఈ నెల 22న విశాఖపట్నంలో జరిగే సీఎం ధర్మ పోరాట దీక్ష విజయవంతం చేయాలని, ఈ దీక్షలో లక్షమంది పాల్గొనేలా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.    

  • Loading...

More Telugu News