ramdev: రేపు ఎవరు గెలుస్తారో వారే కేంద్రంలోనూ 2019లో అధికారంలోకి వస్తారు: రామ్‌ దేవ్‌ బాబా

  • ఈ ఎన్నికలు భారత రాజకీయాలకే కొత్త మార్గాన్ని చూపుతాయి 
  • రేపు గెలిచేవారికే 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచే సత్తా
  • రామ్ దేవ్‌ బాబా ఆసక్తికర వ్యాఖ్యలు
  • రేపు కర్ణాటక ఎన్నికల ఫలితాలు

దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్న విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకోవడానికి బీజేపీ, మరోసారి అధికారంలోకి రావడానికి కాంగ్రెస్‌ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాయి. బీజేపీ తన జైత్ర యాత్ర కర్ణాటకలోనూ కొనసాగిస్తుందా? అనే ఆసక్తి నెలకొంది. అయితే, హంగ్‌ ఏర్పడే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఎగ్జిట్‌ పోల్స్‌ ద్వారా తెలుస్తుండడం మరింత ఉత్కంఠను రేపుతోంది.

తాజాగా, యోగా గురు రామ్‌ దేవ్‌ బాబా మీడియాతో మాట్లాడుతూ రేపు వెల్లడి కానున్న ఫలితాలపై స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఎన్నికలు భారత రాజకీయాలకే కొత్త మార్గాన్ని చూపుతాయని అన్నారు. రేపు వెల్లడి కానున్న ఫలితాల్లో విజయం సాధించేవారికి 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచే సత్తా, అవకాశాలు ఉంటాయని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News