Pawan Kalyan: తిరుమలలో ఏకాంతంగా పవన్... ఎవరినీ కలవని జనసేనాని!

  • గత రాత్రి కాలినడకన తిరుమలకు చేరిన పవన్
  • హంపీ మఠంలో బస
  • ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు

తిరుమలలో మూడు రోజులు గడిపేందుకు వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్, గత రాత్రి 9 గంటల నుంచి కాలినడకన కొండపైకి చేరుకుని, హంపీ మఠంలో బసచేశారు. ఆపై ఈ ఉదయం స్వామివారిని దర్శించుకుని వచ్చిన ఆయన పర్యటన పూర్తి వ్యక్తిగతమని జనసేన వర్గాలు వెల్లడించాయి.

మూడు రోజుల పాటు మఠంలోనే పవన్ ఏకాంతంగా ఉంటారని జనసేన పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మూడు రోజుల పాటు పవన్ ఎవరినీ ప్రత్యేకంగా కలవబోరని, ఎటువంటి చర్చలూ ఉండవని తెలిపాయి. కాగా, పవన్ ఉన్నారన్న సమాచారంతో పలువురు అభిమానులు, భక్తులు హంపీ మఠం వద్దకు రావడంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. మఠం పరిసరాల్లో పోలీసులు ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News