KTR: కర్ణాటక ఎగ్జిట్ పోల్స్‌పై.. నవ్వులు పూయిస్తోన్న కేటీఆర్ ట్వీట్

  • కన్ఫ్యూజ్‌ అవుతున్నాను
  • రెండు ఇంగ్లిష్ చానళ్లు బీజేపీకే అత్యధిక స్థానాలంటున్నాయి
  • మరో రెండేమో కాంగ్రెస్‌కే అత్యధిక సీట్లంటున్నాయి
  • ఎగ్జిట్ పోల్స్ కూడా హంగ్‌లా ఉన్నాయి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను పలు సంస్థలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, వీటిల్లో కొన్ని సంస్థలు.. బీజేపీకి అత్యధిక సీట్లు వస్తాయని చెబితే, మరికొన్ని కాంగ్రెస్‌ పార్టీయే అత్యధిక స్థానాల్లో గెలుస్తుందని పేర్కొన్నాయి. కొన్ని ఇంగ్లిష్‌ ఛానెళ్లలో ఎగ్జిట్‌ పోల్స్‌ చూసిన తెలంగాణ మంత్రి కేటీఆర్.. తాను కన్ఫ్యూజ్‌ అవుతున్నానని ట్వీట్‌ చేశారు.

'ఇంగ్లిష్‌ ఛానెళ్లలో కర్ణాటక ఎగ్టిట్ పోల్స్ ఫలితాలను చూడడం కంటే కన్ఫ్యూజ్‌ అయ్యే విషయం మరొకటి లేదు. రెండు ఇంగ్లిష్ చానళ్లు బీజేపీకే అత్యధిక స్థానాలంటుంటే, మరో రెండు చానళ్లు కాంగ్రెస్‌కే అత్యధిక సీట్లని చూపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా హంగ్‌లా ఉన్నాయి' అని ట్వీట్‌ చేస్తూ నవ్వుతూ ఉన్న ఎమోజీలను పోస్ట్ చేశారు.  

  • Loading...

More Telugu News