Karnataka: ముగిసిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌

  • చెదురుమదురు ఘటనలు మినహా అంతా ప్రశాంతం
  • సాయంత్రం 5 గంటల వరకు 64 శాతం పోలింగ్‌
  • కాసేపట్లో ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు

చెదురుమదురు ఘటనలు మినహా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంటల వరకు 64 శాతం పోలింగ్‌ నమోదయిందని సంబంధిత అధికారులు తెలిపారు. ఆ రాష్ట్రంలోని రామనగర్‌ జిల్లాలో అత్యధికంగా 84 శాతం పోలింగ్ నమోదు కాగా, బెంగళూరు పట్టణంలో అత్యల్పంగా 44 శాతం నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో ఉన్న వారు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. కాసేపట్లో ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు వెల్లడి కానున్నాయి. తమ పార్టీయే విజయం సాధిస్తుందని కాంగ్రెస్‌, బీజేపీ, జేడీఎస్‌ నేతలు ఎవరికి వారు చెప్పుకుంటున్నారు.    

  • Loading...

More Telugu News