bride: పెళ్లి దుస్తుల్లోనే వచ్చి... ఓటు వేసిన నవవధువు!

  • కొనసాగుతోన్న కర్ణాటక అసెంబ్లీ పోలింగ్
  • మడికెరిలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన పెళ్లి కూతురు
  • మంగళూరులో ఓటు ప్రాధాన్యతను తెలియజెప్పిన మరో నవవధువు

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓ ముచ్చట చోటుచేసుకుంది. కాసేపట్లో పెళ్లి పెట్టుకుని మండపానికి వెళ్లకుండా, మడికెరిలోని పోలింగ్ బూత్ 131లో ఓ పెళ్లి కూతురు తన బంధువులతో కలిసి వచ్చి ఓటు వేసింది. అనంతరం తాను ఓటు హక్కు వినియోగించుకున్నట్లు మీడియా కెమెరాలకు పోజులిచ్చి వివాహం చేసుకోవడానికి వెళ్లిపోయింది. మరోవైపు మంగళూరులో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పెళ్లి కాగానే ఓ నవవధువు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుని ఓటు ప్రాధాన్యతను తెలియజెప్పింది.                                

  • Loading...

More Telugu News