bank: సమ్మెకు పిలుపునిచ్చిన బ్యాంకు ఉద్యోగులు

  • వేతనాల సమీక్ష విషయంలో చర్చలు విఫలం
  • ఈ నెల 30 ఉదయం 6 గంటల నుంచి సమ్మె
  • వచ్చేనెల 1 సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింపు

వేతనాల సమీక్ష విషయంలో యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంకు యూనియన్లు (యూఎఫ్‌బీయూ), ఇండియన్ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ)కి మధ్య ఇటీవల జరిగిన చర్చలు ఫలించకపోవడంతో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) నాయకులు 48 గంటల సమ్మెకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో పనిచేస్తోన్న సుమారు 10 లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొననున్నట్లు తెలిపారు.

ఈ నెల 30న ఉదయం 6 గంటల నుంచి వచ్చేనెల 1న సాయంత్రం 6 గంటల వరకు ఈ సమ్మె నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే తాము సంబంధిత అధికారులకు సమ్మె నోటీసులిచ్చామని తెలిపారు. 

  • Loading...

More Telugu News