keerthi suresh: తెలుగు రాష్ట్రాల్లోనే కాదు .. అమెరికాలోను 'మహానటి' జోరు!

  • తొలి రోజున నైజామ్ వసూళ్లు 66 లక్షలు 
  • తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు వసూళ్లు 1.42 కోట్లు
  • వీకెండ్ లో మరింత పెరగనున్న వసూళ్లు        

తెరపై ఎంతో గొప్పగా నటించిన సావిత్రి .. తన చుట్టూ వున్న కొంతమంది నటనను తెలుసుకోలేక మోసపోయిందని అంటూ వుంటారు. అలాంటి సావిత్రి జీవితచరిత్ర 'మహానటి' పేరుతో మొన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలి రోజున 1.42 కోట్లను వసూలు చేసింది. తొలిరోజున ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 66 లక్షలు రాబట్టడం విశేషం.ఇక అమెరికాలో 'నా పేరు సూర్య' తొలిరోజు వసూళ్లను 'మహానటి' అధిగమించడం ఆశ్చర్యం. సావిత్రికి గల క్రేజ్ .. ఆమె జీవితంలో చోటుచేసుకున్న విషాద సంఘటనలు .. ఆయా పాత్రలను మంచి క్రేజ్ వున్న నటీనటులు పోషించడం ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడానికి కారణం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక శుక్ర .. శని .. ఆదివారాల్లో ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.     

  • Loading...

More Telugu News