Prakash Raj: ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి: కన్నడిగులకు ప్రకాష్ రాజ్ సూచన

  • మనం ఓటు వేసే వారే రేపు నిర్ణయాలు తీసుకుంటారు
  • అవి మన జీవితాల్ని ప్రభావితం చేస్తాయి
  • వివేకంతో ఓటు వేయాలని పిలుపు

కర్ణాటక రాష్ట్ర శాసనసభకు రేపు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలకు  ప్రముఖ దక్షిణాది నటుడు ప్రకాష్ రాజ్ పలు సూచనలు చేశారు. ఎవరికైతే ఓటు వేస్తామో రేపు వారే విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారని గుర్తు చేశారు. ఆ విధానాలు మన జీవితాలను ప్రతిక్షణం ప్రభావితం చేస్తూనే ఉంటాయని హెచ్చరించారు.

ఒకసారి ఆలోచించి ఆ తర్వాత వివేకంతో ఓటు వేయాలని కర్ణాటక ఓటర్లకు పిలుపునిచ్చారు. ఉజ్వల, సమ్మిళిత, భవిష్యత్తు భారతావని ఆవిష్కరణ విషయంలో ఇది మీ అందరి బాధ్యత అని గుర్తు చేశారు. ఈ మేరకు ప్రకాష్ రాజ్ ఓ వీడియోను తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి ఈ నెల 12న ఎన్నికలు జరగనుండగా, 15న ఫలితాలు వెలువడనున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News