Mahesh Babu: 200 కోట్ల క్లబ్ లోకి 'భరత్ అనే నేను'

  • భారీ వసూళ్లు సాధిస్తోన్న 'భరత్'
  • అభిమానుల్లో ఆనందం 
  • హిందీ రీమేక్ రైట్స్ కోసం పోటీ     

'భరత్ అనే నేను' సినిమాకి ముందు మహేశ్ బాబు చేసిన రెండు సినిమాలు పరాజయంపాలు కావడంతో, ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని ఆయన అభిమానులు కోరుకున్నారు. ఈ సినిమా సాధిస్తోన్న వసూళ్లు చూస్తుంటే వాళ్ల ఆశ ఫలించిందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఏప్రిల్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, మే 5వ తేదీ నాటికి 190 కోట్లకి పైగా వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమా 200కోట్ల క్లబ్ లోకి చేరిపోయిందనేది తాజా సమాచారం. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మొదటి నుంచి తమిళనాట కూడా 'భరత్ అనే నేను' అదే ఊపును కొనసాగిస్తోండటం విశేషం. ఈ సినిమా ఈ స్థాయి విజయం సాధించడంతో, బాలీవుడ్ నిర్మాతలు రీమేక్ రైట్స్ కోసం పోటీపడుతున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News