Allu Arjun: బన్నీకి భారీ హిట్ తెచ్చిన 'రేసుగుర్రం' .. సీక్వెల్ దిశగా సన్నాహాలు

  • అల్లు అర్జున్ భారీ హిట్లలో 'రేసుగుర్రం'
  • దర్శకుడిగా వ్యవహరించిన సురేందర్ రెడ్డి 
  • ఈ కాంబినేషన్లో సీక్వెల్ కి సన్నాహాలు

అల్లు అర్జున్ చేసిన చెప్పుకోదగిన సినిమాల్లో 'రేసుగుర్రం' ఒకటి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా, 2014లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ ఏడాది ఘన విజయాన్ని సాధించిన చిత్రంగా నిలిచింది. శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ సినిమా, కథాకథనాల పరంగా .. బన్నీ మేనరిజం పరంగా అన్నివర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అల్లు అర్జున్ వున్నాడట. మొదటి సినిమాకి కథాపరమైన కొనసాగింపుగా కాకుండా, మరో కోణంలో కథ ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి .. 'సైరా' సినిమాతో బిజీగా వున్నాడు. ఆ ప్రాజెక్టు పూర్తయిన తరువాత 'రేసుగుర్రం' సీక్వెల్ పట్టాలెక్కనున్నట్టు చెబుతున్నారు.       

  • Loading...

More Telugu News