Andhra Pradesh: చంద్రబాబు చాలా కష్టపడుతున్నారు.. ఆయన్ని ఏమీ అనలేం!: ప్రకాశ్‌ రాజ్

  • ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ హామీ ఇచ్చారు
  • ఇప్పటికీ అమలు చేయలేదు
  • ఏపీ ప్రజలకి చాలా అన్యాయం జరిగింది 

రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కి ఏదో ఒకటి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా కష్టపడుతున్నారని సినీనటుడు ప్రకాశ్‌ రాజ్‌ అన్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.... ప్రత్యేక హోదాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చి అమలు చేయలేదని, దీంతో ఏపీ ప్రజలకి చాలా అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు.

కేంద్ర సర్కారు నుంచి సాయం అందకుండాపోతుండడంతో చంద్రబాబు నిస్సహాయంగా ఉన్నారని, ఈ పరిస్థితుల్లో చంద్రబాబును ఏమీ అనలేమని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలు ప్రత్యేక హోదాని అడుక్కోవడం లేదని, అది సాధించుకోవడం వాళ్ల హక్కని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ సాయం చేయకపోతే ఈ పరిస్థితుల్లో ఏపీ ఎలా ఎదుగుతుందని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News