Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో చిరుతపులి మృతదేహం!

  • రెండో కనుమ దారిలో ఘటన
  • గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న భక్తులు

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో కనుమ రహదారిలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ చిరుతపులి మరణించింది. రహదారిలో విఘ్నేశ్వరుని ఆలయానికి పై భాగంలో రోడ్డుపై పడివున్న చిరుతపులి మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. అడవి నుంచి రోడ్డుపైకి వచ్చిన చిరుతను వాహనం ఢీకొనగా, ముఖానికి తీవ్ర గాయాలై మరణించిందని తెలిపారు. ఈ చిరుతకు మూడు సంవత్సరాల వయసు ఉంటుందని అన్నారు. కాగా, ఇటీవలి కాలంలో తిరుమల గిరుల పరిధిలో చిరుతపులుల సంచారం కాస్తంత తగ్గిందని భావిస్తుండగా, తాజా ఘటనతో భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News