Karnataka: కర్ణాటక ఎన్నికల ప్రచారం: మోదీ - అమిత్ షా, సోనియా- రాహుల్ సభలు!

  • ఈరోజు బెంగళూరులో ర్యాలీ..  పాల్గొననున్న మోదీ
  • బీజాపూర్ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించనున్న సోనియాగాంధీ
  • బెంగళూరు అర్బన్ ఓటర్లతో సమావేశం కానున్న రాహుల్ గాంధీ

కర్ణాటక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇక కొన్ని రోజులే సమయం ఉండటంతో, జాతీయ పార్టీలు ఎన్నికల ప్రచారం జోరును పెంచాయి. కర్ణాటకలోని పలు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేసిన ప్రధాని మోదీ ఈరోజు బెంగళూరులో ర్యాలీ నిర్వహించనున్నారు. ఈరోజు సాయంత్రం నేషనల్ కాలేజీలో నిర్వహించే భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు.

బెంగళూరు సిటీలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులను ఈ వేదిక నుంచి మోదీ పరిచయం చేస్తారు. కర్ణాటకలోని కొప్పుల, విజయపురలలో కూడా మోదీ ప్రచారం చేయనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. కొడగు, మడికేరిలలో నిర్వహించే రోడ్ షోలలో ఆయన పాల్గొంటారు. బెంగళూరు అర్బన్ లో బీజేపీ నేత స్మృతీ ఇరానీ కూడా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. యూపీ సీఎం ఆదిత్యానాథ్ కూడా మంగళూరులో నిర్వహించే ప్రచారంలో పాల్గొననున్నారు.

కాగా, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ కూడా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఈరోజు పాల్గొననున్నారు. బీజాపూర్ లో నిర్వహించే ఎన్నికల ర్యాలీలో ఆమె ప్రసంగించనున్నారు.
బెంగళూరు అర్బన్ ఓటర్లతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమావేశం అవుతారు. అనంతరం, చిక్ బళ్లాపూర్, తుముకూరులో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. 

  • Loading...

More Telugu News