Police: ఉన్నావో, కథువా ఘటనల్లో లభించని న్యాయం మాకు లభించింది: దాచేపల్లి బాధితురాలి బంధువు

  • ఏపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది
  • ముందు కేసు పెట్టాలా? వద్దా? అని ఆలోచించాం
  • చివరకు న్యాయం కోసం కేసు పెట్టాం 
  • రేపిస్టులని బహిరంగంగా ఉరి తీసే చట్టాలు రావాలి

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో, జమ్ముకశ్మీర్‌లోని కథువాల్లో ఇటీవల జరిగిన అత్యాచార ఘటనల్లో బాధితులకి లభించని న్యాయం తమకు లభించిందని గుంటూరు జిల్లాలోని దాచేపల్లి అత్యాచార బాధితురాలి బంధువు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అన్నారు. ఈ రోజు చంద్రబాబు నిర్వహించిన మీడియా సమావేశంలో దాచేపల్లి బాధితురాలి బంధువు ఒకరు కాసేపు మాట్లాడాడు.

ఏపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో తమకు న్యాయం జరిగిందని తెలిపాడు. ఈ ఘటన తమకు తెలియగానే ముందు కేసు పెట్టాలా? వద్దా? అనే విషయంపై ఆలోచించామని, చివరకు న్యాయం కోసం కేసు పెట్టామని తెలిపాడు. ఇటువంటి ఘటనలు ఎక్కడా జరగకుండా ఉండాలంటే అత్యాచారాలకి పాల్పడ్డ వారిని బహిరంగంగా ఉరి తీసే చట్టాలు రావాలని వ్యాఖ్యానించాడు.   

  • Loading...

More Telugu News