bellamkonda srinivas: 'సాక్ష్యం' ఫస్టు సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్!

  • బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా 'సాక్ష్యం'
  • కథానాయికగా పూజా హెగ్డే 
  • విదేశాల్లోనే పాటల చిత్రీకరణ 

శ్రీవాస్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ 'సాక్ష్యం' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక్కో ఐటమ్ ను వదులుతూ వస్తున్నారు. అలా ఈ సినిమా నుంచి మొదటి పాటగా 'సౌందర్య లహరి' అనే పాటను రేపు రిలీజ్ చేయనున్నారు.

పాటలన్నీ కూడా ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. చాలావరకూ విదేశాల్లోని అందమైన .. ఖరీదైన లొకేషన్స్ లో చిత్రీకరించిన పాటలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మాస్ హీరోగా ఇప్పటికే మంచి మార్కులు కొట్టేసిన బెల్లంకొండ శ్రీనివాస్, ఈ సినిమా తన కెరియర్ కి మరింత హెల్ప్ అవుతుందని భావిస్తున్నాడు. 

  • Loading...

More Telugu News