KCR: ప్రాంతీయ పార్టీలు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలి: కనిమొళితో భేటీ తరువాత కేసీఆర్‌

  • చైన్నైలో రెండో రోజు కొనసాగుతోన్న కేసీఆర్‌ పర్యటన 
  • వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు ప్రాంతీయ పార్టీలకే
  • ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండాల్సి ఉంది

దేశంలో గుణాత్మక మార్పే లక్ష్యమంటూ బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఫ్రంట్‌ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ రోజు చెన్నైలో రెండో రోజు కూడా పలువురు నేతలతో భేటీ అవుతున్నారు. డీఎంకే ఎంపీ కనిమొళితో కేసీఆర్‌ భేటీ ముగిసింది.

ఈ సందర్భంగా కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ...  ప్రాంతీయ పార్టీలు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని అన్నారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటేనే సమాఖ్య స్ఫూర్తి  మెరుగుపడుతుందని, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ కన్నా ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ సీట్లు వస్తాయని అన్నారు. తెలంగాణలో కొనసాగిస్తోన్న పథకాలను కనిమొళికి కేసీఆర్‌ వివరించారు.

  • Loading...

More Telugu News