rajanth singh: రాజకీయాలనేవి స్వాంతంత్ర్యం రాకముందు కూడా ఉన్నాయి: రాజ్‌నాథ్‌ సింగ్‌

  • రాముడు, కృష్ణుడు కూడా రాజకీయాలు చేశారు
  • రాముడు రామ రాజ్యం నెలకొల్పాడు
  • ఎంతో అంకితభావంతో రాజకీయాలు నడిపారు
  • శ్రీకృష్ణుడు ఎంతో తర్కంతో, పలు వ్యూహాలతో చేశాడు

భారతదేశంలో రాజకీయాలనేవి స్వాంతంత్ర్యం రాకముందు కూడా మన దేశంలో ఓ భాగంగా ఉన్నాయని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాజ్‌నాథ్ సింగ్ లక్నోకు వచ్చారు. ఈ సందర్భంగా లక్నోలో ఏబీవీపీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్‌ నాథ్‌ సింగ్ మాట్లాడుతూ.... రాముడు, కృష్ణుడు కూడా రాజకీయాలు చేశారని, రాముడు సమర్థవంతంగా రాజకీయాలు చేసి రామ రాజ్యం నెలకొల్పాడని, ఎంతో అంకితభావంతో రాజకీయాలు నడిపారని వ్యాఖ్యానించారు. అలాగే శ్రీకృష్ణుడు ఎంతో తర్కంతో, పలు వ్యూహాలతో రాజకీయాలు నడిపించాడని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News