kcr: 150 గదులున్నాయని నేను అనలేదు.. కావాలంటే నిరూపిస్తా!: కేసీఆర్ వ్యాఖ్యలకు ఉత్తమ్ కౌంటర్

  • నేను చేసిన వ్యాఖ్యలను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నా
  • ప్రజాధనంతో కేసీఆర్ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని మాత్రమే వ్యాఖ్యానించా
  • ఆంధ్రావాళ్లకు సంచులు మోస్తోంది నేను కాదు కేసీఆరే!

ప్రగతిభవన్ లో 150 గదులు ఉన్నాయని వ్యాఖ్యలు చేసిన టీపీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతముక్కు నేలకు రాయిస్తానని సీఎం కేసీఆర్ మండిపడ్డ విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఉత్తమ్ స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రగతి భవన్ లో 150 గదులు ఉన్నాయని తాను అనలేదని, ప్రజాధనంతో కేసీఆర్ అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని మాత్రమే వ్యాఖ్యానించానని, ఈ విషయమై తాను చేసిన వ్యాఖ్యలను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఆంధ్రావాళ్లకు సంచులు మోస్తున్నానని కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారని, ఆ పని  చేస్తోంది కేసీఆరేనని అన్నారు. 

  • Loading...

More Telugu News