Telangana: కొన్ని పేపర్లు తప్పుడు రాతలు రాస్తున్నాయి..వాటిని మానుకోవాలి!: సీఎం కేసీఆర్

  • 30 శాతం మంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వమని తప్పుడు రాతలు రాస్తున్నాయి!
  • అందరికీ టికెట్లు ఇస్తాం..సిట్టింగ్ ఎమ్మెల్యేలను గెలిపించుకుంటాం
  • ప్రజల్లో గెలిచి రాని వారికి ఎమ్మెల్సీలుగా అవకాశమిస్తాం

వచ్చే ఎన్నికల్లో ముప్పై శాతం మంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వమంటూ కొన్ని పేపర్లు తప్పుడు వార్తలు రాస్తున్నాయని .. ఆ రాతలు మానుకోవాలని సీఎం కేసీఆర్ హితవు పలికారు. కొంపల్లిలో టీఆర్ఎస్ ప్లీనరీ ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అందరికీ టికెట్లు ఇస్తామని, ప్రస్తుత కేబినెట్ లో ఎటువంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేలందరినీ గెలిపించుకుంటామని, ప్రజల్లో గెలిచి రాని వారికి ఎమ్మెల్సీలుగా అవకాశమిస్తానని చెప్పారు. ఆంధ్రా వాళ్ల ఆస్తులు లాగేసుకుంటారని, దాడులు చేస్తారని గతంలో తమపై జరిగిన దుష్ప్రచారాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రస్తావించారు. హైదరాబాద్ లో ఉన్నవాళ్లంతా తెలంగాణ బిడ్డలేనని, భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.

  • Loading...

More Telugu News