Chandrababu: ప్రస్తుతం రాష్ట్రమంతటా వేలాది అన్నదాతల ముంగిళ్లు రథాలతో సందడి చేస్తున్నాయి: చంద్రబాబు ట్వీట్

  • 'రైతు రథం' పేరుతో సబ్సిడీపై ట్రాక్టర్ల పంపిణి
  • రెండేళ్లలో రాయితీపై 20 వేల ట్రాక్టర్లను అందించాలని లక్ష్యం
  • తొలి ఏడాది 6,000 ట్రాక్టర్ల మంజూరు

గతంలో రైతులకు ఉచితంగా రెయిన్‌ గన్‌లు అందించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా 'రైతు రథం' పేరుతో సబ్సిడీపై రైతులకు ట్రాక్టర్లను అందించింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.

'సన్నకారు రైతుల సాగు కష్టాలు తీర్చేందుకు ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం ‘రైతు రథం’. దీనిద్వారా రెండేళ్లలో రాయితీపై 20 వేల ట్రాక్టర్లను అందించాలనే లక్ష్యంతో తొలి ఏడాది 6,000 ట్రాక్టర్లు మంజూరు చేశాం. ప్రస్తుతం రాష్ట్రమంతటా వేలాది అన్నదాతల ముంగిళ్లు రథాలతో సందడి చేస్తున్నాయి' అని పేర్కొంటూ చంద్రబాబు అందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు.       

  • Loading...

More Telugu News