srinivas: రాజమండ్రికి 'సాక్ష్యం' .. హిట్ కొట్టడం ఖాయమట!

  • షూటింగ్ దశలో శ్రీనివాస్ 'సాక్ష్యం' 
  • ఆయనకు జోడీగా పూజా హెగ్డే 
  • జూన్ 14వ తేదీన విడుదల  

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా దర్శకుడు శ్రీవాస్ 'సాక్ష్యం' సినిమాను రూపొందిస్తున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో, ఈ సినిమా సక్సెస్ పట్ల దర్శక నిర్మాతలు మరింత నమ్మకంతో వున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ .. "పంచభూతాలను కేంద్రబిందువుగా తీసుకుని .. అన్ని కమర్షియల్ అంశాలను కలుపుకుని ఈ కథను తయారుచేసుకున్నట్టుగా చెప్పారు. ఈ సినిమాలో నటన పరంగా శ్రీనివాస్ లోని కొత్త కోణం కనిపిస్తుందనీ, శ్రీవాస్ స్క్రీన్ ప్లే హైలైట్ గా నిలుస్తుందని అన్నారు.

ఇంతవరకూ అమెరికా .. దుబాయ్ .. వారణాసిలలో షూటింగ్ జరిపామనీ, ఈ రోజు నుంచి రాజమండ్రిలో షూటింగ్ చేస్తున్నామని చెప్పారు. ఈ షెడ్యూల్ తో టాకీ పార్టు పూర్తవుతుందనీ .. జూన్ 14వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని అన్నారు. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.        

  • Loading...

More Telugu News