Jagan: తమ్ముడూ జగన్.. నువ్వు ఇరిగేషన్ గురించి మాట్లాడకు!: దేవినేని ఉమ

  • ఇరిగేషన్ గురించి జగన్ కేమీ తెలియదని ఎప్పుడో చెప్పా
  • జగన్ చేస్తోంది పాదయాత్ర కాదు.. మార్నింగ్, ఈవినింగ్ వాక్
  • ప్రధాని మోదీ కాళ్లపై విజయసాయిరెడ్డి పడ్డారు

‘తమ్మూడూ జగన్.. నువ్వు ఇరిగేషన్ గురించి మాట్లాడకు’ అంటూ వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి దేవినేని ఉమ విరుచుకుపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇరిగేషన్ గురించి జగన్ కేమీ తెలియదని ఎప్పుడో చెప్పానని అన్నారు. జగన్ చేస్తోంది పాదయాత్ర కాదని, మార్నింగ్, ఈవినింగ్ వాక్ అని విమర్శించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధాని మోదీ కాళ్లపై పడినందుకు జగన్ కు లబ్ధి చేకూరిందని, ఈడీ ఆస్తుల అటాచ్ మెంట్ ఎత్తేసారని అన్నారు. 

  • Loading...

More Telugu News