charan: బన్నీ మూవీ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా చరణ్

  • బన్నీ హీరోగా 'నా పేరు సూర్య'
  • ఈ నెల 29న ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • వచ్చేనెల 4న సినిమా రిలీజ్

అల్లు అర్జున్ కథానాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య' రూపొందింది. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, వచ్చేనెల 4వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ లోగా ఈ నెల 29వ తేదీన హైదరాబాద్ 'గచ్చిబౌలీ'లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా జరపనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ వేడుకకి ముఖ్య అతిథిగా చరణ్ రానున్నట్టు సమాచారం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి రావలసిందట. అయితే ఆయన విదేశాల్లో ఉండటం వలన, చరణ్ వస్తున్నాడని అంటున్నారు. దేశభక్తి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా, తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకంతో బన్నీ వున్నాడు. ఇక అనూ ఇమ్మాన్యుయేల్ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది.     

  • Loading...

More Telugu News