telangana: కవిత సంస్థ ఫ్లెక్సీలను తొలగించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరులు

  • మంత్రులు హరీష్, జగదీష్ రెడ్డిల పర్యటన సందర్భంగా ఘటన
  • ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన జాగృతి నేతలు
  • ఎమ్మెల్యే ఫొటో లేదంటూ ఫ్లెక్సీల తొలగింపు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎంపీ కవిత నేతృత్వంలో నడుస్తున్న జాగృతి సంస్థ ఫ్లెక్సీలను తొలగించడం వివాదాస్పదమైంది. సాక్షాత్తు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరులే ఈ చర్యకు పాల్పడటం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే, సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డిల పర్యటన సందర్భంగా తెలంగాణ జాగృతి నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్ ఫొటో లేదంటూ ఆయన అనుచరులు నిన్న రాత్రి ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత ఆ ఫ్లెక్సీలను తొలగించారు. ఈ నేపథ్యంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి కుమార్తె నేతృత్వంలో నడుస్తున్న సంస్థ ఫ్లెక్సీలను ఎమ్మెల్యే అనుచరులు తొలగించడం పట్ల స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News