venkatesh: భారీ మల్టీ స్టారర్ మూవీలో అనసూయ

  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2'
  • హీరోలుగా వెంకటేశ్ .. వరుణ్ తేజ్ 
  • కథానాయికగా మెహ్రీన్ 

బుల్లితెర పరంగా చూసుకుంటే అనసూయకి ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. ఈ క్రేజ్ ఆమెను వెండితెరకి పరిచయం చేసింది. ఆమెకి సరైన గుర్తింపును తెచ్చిపెట్టిన సినిమా 'రంగస్థలం' అనే చెప్పాలి. ఈ సినిమాలో ఆమె పోషించిన 'రంగమ్మత్త' పాత్ర విపరీతమైన క్రేజ్ ను తెచ్చిపెట్టింది. దాంతో ఆమెకి వరుస ఆఫర్లు వస్తున్నాయి.

అనసూయ కోసమే ప్రత్యేక పాత్రలను సృష్టించడం .. పాటలను క్రియేట్ చేయడం మొదలైపోయింది. ఈ నేపథ్యంలో ఆమెకి అనిల్ రావిపూడి సినిమాలో ఒక కీలకమైన రోల్ దక్కిందని సమాచారం. ఈ పాత్ర ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.

వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కథానాయకులుగా నటిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా మెహ్రీన్ ను తీసుకున్నారు. మరో కథానాయిక కోసం అన్వేషణ కొనసాగుతోంది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకి 'ఎఫ్ 2' అనే టైటిల్ ను ఖరారు చేశారు. మే నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.  

  • Loading...

More Telugu News