srishakthi: శ్రీరెడ్డిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ‘జనసేన’ కార్యకర్తలు

  • పవన్ కల్యాణ్ పై, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు తగదు
  • మండిపడుతున్న‘జనసేన’ కార్యకర్తలు
  • ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

జనసేన పార్టీ అధినేత, అగ్రహీరో పవన్ కల్యాణ్ పై నటి శ్రీశక్తి (శ్రీరెడ్డి) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీశక్తిపై తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జనసేన పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఆమెపై ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పవన్ కల్యాణ్ పై, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీశక్తిపై చర్యలు తీసుకోవాలంటూ ఆ ఫిర్యాదులో ‘జనసేన’ కార్యకర్తలు కోరారు.  

  • Loading...

More Telugu News