vijay devarakonda: కాలేజ్ స్టూడెంట్ గా విజయ్ దేవరకొండ

  • భరత్ కమ్మతో విజయ్ దేవరకొండ
  • కథానాయికగా రష్మిక మందన 
  • జూన్ లో షూటింగు మొదలు

యూత్ లో విజయ్ దేవరకొండకి విపరీతమైన క్రేజ్ వుంది. ప్రస్తుతం ఆయన చేతిలో అరడజను సినిమాల వరకూ వున్నాయి. ఈ సినిమాల్లో ముందుగా 'టాక్సీవాలా' రానుంది. విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ సినిమా మే 18వ తేదీన ప్రేక్షకులను పలకరించనుంది. ఇక 'నోటా' అనే ద్విభాషా చిత్రాన్ని కూడా ఆయన పూర్తిచేసే పనిలో వున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన భరత్ కమ్మ అనే దర్శకుడితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు.

 మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ సినిమాను .. జూన్ నుంచి ఆరంభించాలనే ఆలోచనలో వున్నారు. ప్రస్తుతం ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కాలేజ్ స్టూడెంట్ గా కనిపించనుండగా, రష్మిక మందన క్రీడాకారిణిగా కనిపించనుంది. త్వరలోనే ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేయనున్నారు. తన కెరియర్లో ఈ సినిమా కూడా ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందని విజయ్ దేవరకొండ భావిస్తున్నాడు.      

  • Loading...

More Telugu News