Mahesh Babu: మహేశ్ 25వ మూవీ షూటింగ్ అమెరికాలో!

  • మహేశ్ బాబు నెక్స్ట్ మూవీ వంశీ పైడిపల్లితో
  • కథానాయికగా పూజా హెగ్డే
  • జూన్ లో సెట్స్ పైకి

కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు చేసిన 'భరత్ అనే నేను' ఈ నెల 20వ తేదీన భారీస్థాయిలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సాధిస్తుందనే విషయంపైనే కాకుండా .. మహేశ్ తదుపరి సినిమాపైన కూడా ఆయన అభిమానులు దృష్టి పెట్టారు.

మహేశ్ బాబు తన 25వ సినిమాను వంశీ పైడిపల్లితో చేయనున్నాడు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పనులను సెట్ చేసుకుని ఆయన రెడీగా వున్నాడు. జూన్ నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నాడు. కథ ప్రకారం ఈ సినిమా ఎక్కువభాగం షూటింగ్ అమెరికాలో జరపనున్నారట. ప్రస్తుతం అక్కడ లొకేషన్స్ ను ఓకే చేసే పనిలో వున్నారు. అశ్వనీదత్ .. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, పూజా హెగ్డే కథానాయికగా కనిపించనుంది. 

  • Loading...

More Telugu News