r narayana murthy: ఆ సీన్లు, డైలాగులు ఎందుకు తీసేయాలి?: మండిపడ్డ ఆర్‌.నారాయణ మూర్తి

  • విడుదలకు సిద్ధమవుతోన్న ‘అన్నదాత సుఖీభవ’
  • ఆర్‌.నారాయణ మూర్తి స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా
  • ముఖ్య సీన్లకు కట్స్ చెప్పిన సెన్సార్ 

సెన్సార్ అధికారుల తీరుపై సినీనటుడు ఆర్‌.నారాయణ మూర్తి మండిపడ్డారు. రైతులు, సమాజంలో పీడిత వర్గాల సమస్యలే ప్రధానాంశాలుగా ఆయన సినిమాలు తీస్తారన్న విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ‘అన్నదాత సుఖీభవ’ అనే సినిమాలో నటించారు. అయితే, ఈ సినిమాని సెన్సార్ కోసం పంపగా, అందులోని కొన్ని సీన్లకు సెన్సార్ కట్స్ చెప్పింది. ప్రధానంగా ‘బడా పారిశ్రామిక వేత్తలు అప్పులు చేస్తే శిక్షలు వేయరు కానీ, రైతు అప్పుకట్టకపోతే పీడిస్తారు’ అనే డైలాగుతో కూడిన సీనుని తీసేయాలని చెప్పడంతో నారాయణమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు.

తాను రైతుల సమస్యలే ఇతివృత్తంగా ఈ సినిమా తీశానని, సినిమాలోని ముఖ్యమైన ఘట్టాలకు సంబంధించిన సీన్లను తొలగించమని సెన్సార్ వారు అంటున్నారని ఆర్‌.నారాయణ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రజల ఆవేదనను తెలియజెప్పాలని చూడడం తప్పా? అని ఆయన ప్రశ్నించారు. రైతులు ఏం పాపం చేశారు? పారిశ్రామిక వేత్తలు ఏం పుణ్యం చేశారు? అని అన్నారు. కోట్లాది రూపాయలు మోసం చేసి కొందరు పారిపోతున్నారని, రైతులను ఆదుకోవాలని సీన్లు తీయడం తప్పా? అని అడిగారు. భారత ప్రజలు కోట్లాది రూపాయల పన్నులు కడుతున్నది ఈ పారిశ్రామిక వేత్తలకు ధారాదత్తం చేయడానికా? అని ప్రశ్నించారు. తాను సెన్సార్ బోర్డు నిర్ణ‌యంపై పునర్విచారణ క‌మిటీ వద్దకు వెళతానని అన్నారు.   

  • Loading...

More Telugu News