inter: ఈ నెల 12న ఏపీ ఇంటర్‌ సెకండియర్‌, 13న ఫస్టియర్‌ పరీక్షా ఫలితాలు

  • ప్రకటన విడుదల చేసిన ఇంటర్ పరీక్షల నియంత్రణ అధికారి
  • ఫలితాలు విడుదల చేయనున్న గంటా శ్రీనివాస రావు
  • వెబ్‌సైట్ల వివరాలు తెలిపిన అధికారులు

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ విద్యా మండలి గత నెలలో నిర్వహించిన ఇంటర్‌ పరీక్ష ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తామన్న విషయంపై విజయవాడలోని తమ కార్యాలయం నుంచి పరీక్షల నియంత్రణ అధికారి రమేశ్ ఈ రోజు ప్రకటన విడుదల చేశారు. ప్రయోగ, థియరీ, జనరల్, ఒకేషనల్ కోర్సులకు నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలను రాజమహేంద్ర వరం నుంచి ఈ నెల 12న మధ్యాహ్నం విడుదల చేస్తామని, అలాగే, మొదటి సంవత్సర పరీక్ష ఫలితాలను విశాఖపట్నం నుంచి ఈ నెల 13 మధ్యాహ్నం విడుదల చేస్తామని తెలిపారు.

ఈ పరీక్షల ఫలితాలను ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి బీ ఉదయలక్ష్మి సంయుక్తంగా విడుదల చేస్తారని వివరించారు. ఈ కింది వెబ్‌సైట్ల నుంచి విద్యార్థులు పరీక్ష ఫలితాలను పొందవచ్చు..       

  • Loading...

More Telugu News