BJP: ఈ మూడు ముఖ్య కారణాల వల్ల 2019లో బీజేపీ మళ్లీ గెలుస్తుంది: సుబ్రహ్మణ్య స్వామి

  • ప్రధానమంత్రి మోదీ నాయకత్వం మొదటి కారణం
  • రెండో కారణం అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ చేస్తోన్న కృషి 
  • మూడో కారణం, కులాలకు అతీతంగా హిందువులు ఏకమై బీజేపీని సమర్ధించడం  

మూడు ముఖ్య కారణాల వల్ల తమ భారతీయ జనతా పార్టీ 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లోనూ గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ ఎంపీ సుబ్రమణ్య స్వామి అన్నారు. న్యూయార్క్‌లోని కొలంబియా బిజినెస్‌ స్కూల్‌లో జరుగుతోన్న 14వ ఇండియన్‌ బిజినెస్‌ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ... తమ పార్టీ వచ్చే ఎన్నికల్లోనూ గెలవడానికి మొదటి కారణం భారత ప్రధానమంత్రి మోదీ నాయకత్వమవుతుందని, రెండో కారణం అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ చేస్తోన్న కృషి, ఇక మూడో కారణం కులాలకు అతీతంగా ఏకమై, బీజేపీని సమర్ధించాలన్న ఆకాంక్ష హిందువుల్లో పెరగడమే అని అన్నారు.

బీజేపీ బలీయమైన భారత్‌ను నిర్మిస్తుందని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ఆర్థిక రంగంలో పనితీరులో మాత్రం తమ సర్కారు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని, నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలు ఆర్థిక పరిస్థితిని సంక్లిష్టం చేశాయని చెప్పారు. 2019లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, తాము మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామని తెలిపారు. మరో పదేళ్లు ఏడాదికి 10 శాతం చొప్పున ఇండియా వృద్ధి సాధిస్తుందని వ్యాఖ్యానించారు. 

  • Loading...

More Telugu News