prabhas: పూజా హెగ్డేతో కలిసి ప్రభాస్ సెట్స్ పైకి వెళ్లేది అప్పుడే!

  • రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ 
  • ఆయనకి ఇది 20వ సినిమా
  • జూలై 7న షూటింగు మొదలు  

ప్రస్తుతం ప్రభాస్ 'సాహో' సినిమా షూటింగుతో బిజీగా వున్నాడు. 'అబుదాబి'లో ఈ సినిమా షూటింగు కొనసాగుతోంది. ఈ సినిమా 150 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోంది. ఈ సినిమా తరువాత ఆయన కృష్ణంరాజు సొంత బ్యానర్లో .. రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ చేయనున్నాడు. ఈ సినిమా కోసం 120 కోట్లను ఖర్చుచేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటించనుంది.

 ఈ జంటను తెరపై చూడటానికి అభిమానులు ఉత్సాహాన్ని చూపుతున్నారు. జూలై 7వ తేదీన ఈ సినిమాను మొదలెట్టనున్నారు. కథా పరంగా ఈ సినిమా చిత్రీకరణ అంతా కూడా యూరప్ లో ఎక్కువగా కొనసాగుతుందని అంటున్నారు. ప్రభాస్ కి గల క్రేజ్ కారణంగా ఈ సినిమాను కూడా ఇతర భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ప్రభాస్ కి ఇది 20వ సినిమా కావడం విశేషం.    

  • Loading...

More Telugu News