poori: ఢిల్లీలో నిరాహార దీక్ష చేసే ముందు కడుపు నిండా పూరీలు తిన్న కాంగ్రెస్ నేతలు.. ఫొటోలు

  • ఎస్సీ, ఎస్టీలపై దాడులను ఖండిస్తూ కాంగ్రెస్‌ నిరాహార దీక్ష
  • ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద పాల్గొన్న రాహుల్‌ గాంధీ
  • అంతకు ముందు హోటల్‌లో టిఫిన్‌ తిన్న కొందరు నేతలు

భారత్‌లో ఎస్సీ, ఎస్టీలపై దాడులను ఖండిస్తూ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఈ రోజు దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరాహార దీక్షలు చేపడుతున్నారు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద జరుగుతోన్న ఈ నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హాజరయ్యారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ తీరుకి నిరసనగా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ నేతలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

కాగా, ఈ రోజు ఉదయం రాజ్‌ఘాట్‌లో నిరాహార దీక్షకి వెళ్లే ముందు కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు హోటల్‌లో పూరీలు తింటూ మీడియాకు చిక్కారు. ఈ ఫొటో బయటకు రావడంతో కాంగ్రెస్ నేత అరవింద్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ... తాము చేసేది ఒక్కరోజు దీక్ష అని, ఈ రోజు ఉదయం 10.30 నుంచి సాయత్రం 4.30 వరకు ఉంటుందని, తాము ఉదయం 8 గంటల ముందే తింటే తప్పేంటని అన్నారు. బీజేపీ నేతలు దేశాన్ని సమర్థవంతంగా పాలించే అంశంపై దృష్టి పెట్టకుండా, తాము ఏం తింటున్నామనే విషయంపై దృష్టి పెట్టారని విమర్శించారు.  

  • Loading...

More Telugu News