charan: 'రంగస్థలం' చాలా టెన్షన్ పెట్టేసింది: సుకుమార్

  • చిరంజీవి గారు అభినందించారు 
  • స్నేహితులు మెచ్చుకున్నారు
  • అయినా టెన్షన్ వెంటాడింది

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను సాధిస్తూ 'రంగస్థలం' దూసుకుపోతోంది. ఈ సినిమా రాబడుతోన్న వసూళ్ల పట్ల .. పొందుతోన్న ఆదరణ పట్ల సుకుమార్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈ సినిమాను గురించి తాజాగా ఆయన స్పందిస్తూ .. " 'రంగస్థలం' సినిమా చూసిన చిరంజీవి గారు .. నా స్నేహితులు చాలామంది అద్భుతంగా ఉందని అన్నారు. అయినా నా టెన్షన్ తగ్గలేదు.

యూఎస్ టాక్ కోసం ఎదురుచూశాను .. పాజిటివ్ టాక్ వచ్చినా టెన్షన్ నన్ను వెంటాడుతూనే వుంది. తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షో టాక్ బయటికి వచ్చిన తరువాత టెన్షన్ తగ్గింది. నా గత చిత్రాల విషయంలో ఎప్పుడూ ఇంత టెన్షన్ పడలేదు. కానీ 'రంగస్థలం' విషయంలోనే నిద్రపట్టలేదు. సక్సెస్ టాక్ వచ్చిన తరువాతనే ప్రశాంతంగా పడుకున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.   

  • Loading...

More Telugu News