chiranjeevi: ప్రత్యేకమైన సెట్లో జోరుగా 'సైరా' షూటింగ్

  • షూటింగు దశలో 'సైరా'
  • ప్రత్యేకమైన సెట్లో ముఖ్యమైన ఘట్టం 
  • కథానాయికగా నయనతార    

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ .. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేకమైన సెట్లో జరుగుతోంది. ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సురేందర్ రెడ్డి తనదైన శైలిలో చిత్రీకరిస్తున్నారు.

 ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తన తిరుగుబాటులో భాగంగా కర్నూలులోని 'కోయిలకుంట్ల' ట్రెజరీని కొల్లగొట్టాడు. ఆ ట్రెజరీ సెట్ ను అల్యూమినియం ఫ్యాక్టరీలో వేశారు. సినిమాలో అత్యంత కీలకమైన సమయంలో వచ్చే ఈ ఘట్టం నుంచి కథనం పుంజుకుంటుంది. ఆడియన్స్ విజిల్స్ వేసేలా ఈ సీన్ ఉంటుందని అంటున్నారు. చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, అమితాబ్ కీలకమైన పాత్రను పోషిస్తోన్న సంగతి తెలిసిందే.    

  • Loading...

More Telugu News