YSRCP: ప్రత్యేక హోదా ఉద్యమాన్ని సజీవంగా ఉంచింది వైసీపీనే : అంబటి రాంబాబు

  • ప్రత్యేక హోదా పై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు
  • చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు
  • అందుకే, అఖిలపక్ష సమావేశానికి ఎవరూ వెళ్లడం లేదు

ఏపీకి ప్రత్యేక హోదా సాధన ఉద్యమాన్ని సజీవంగా ఉంచింది వైసీపీయేనని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఈరోజు విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక హోదా పై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, కేవలం మీడియాలో వార్తల కోసమే ఆయన ఉత్తుత్తి ఉద్యమాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు కనుకనే, ఆయన నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ఎవరూ వెళ్లడం లేదని అన్నారు. ప్రత్యేక హోదా సాధన నిమిత్తం వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన విధంగానే టీడీపీ ఎంపీలూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమ ఎంపీలతో రాజీనామాలు చేయించాల్సిన చంద్రబాబు నిమిషానికో మాట మాట్లాడుతున్నారని, రాజకీయ రణక్షేత్రంలో ఆయన ఏకాకిలా మిగిలిపోక తప్పదని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News