Mahesh Babu: స్పెయిన్ షెడ్యూల్ పూర్తిచేసిన మహేశ్

  • 'భరత్ అనే నేను' ఆడియో రిలీజ్ కి సన్నాహాలు 
  • భారీ బహిరంగ సభగా జరగనున్న ఫంక్షన్ 
  • అభిమానుల్లో పెరుగుతోన్న ఆసక్తి      

కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను' సినిమా రూపొందుతోంది. ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్ ను పూర్తిచేసిన ఈ సినిమా టీమ్, స్పెయిన్ చేరుకుంది. నాయకా నాయికల మధ్య అక్కడ కొన్ని సన్నివేశాలను .. ఒకటి రెండు పాటలను కొన్ని రోజులుగా చిత్రీకరిస్తూ వచ్చారు. ఈ సినిమా ఆడియో వేడుక ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ - ఎల్బీ స్టేడియం లో భారీస్థాయిలో జరగనుంది.

అందువలన స్పెయిన్ లో షూటింగును ఈ సినిమా టీమ్ పూర్తి చేసింది. ఈ సినిమాలో మహేశ్ బాబు .. ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడు. అందువలన ఈ సినిమా ఆడియో వేడుకను భారీ బహిరంగ సభగా చెబుతుండటం విశేషం. మహేశ్ అభిమానులంతా కూడా ఈ వేడుక కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో కైరా అద్వాని కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.  

  • Loading...

More Telugu News